లోకేష్​ పాదయాత్రకు మరోసారి బ్రేక్...ఎందుకంటే

లోకేష్​ పాదయాత్రకు మరోసారి బ్రేక్...ఎందుకంటే

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ తన యువగళం పాదయాత్రకు మరోసారి వాయిదా వేసుకున్నారు. వర్షాలు భారీగా కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో పాదయాత్ర చేయడం సులువు కాదన్న అభిప్రాయంతో వెనక్కి తగ్గారు. మిచౌంగ్ తుపాను మంగళవారం నెల్లూరు–-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటనుంది. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో మూడ్రోజుల పాటు యువగళం పాదయాత్రకు లోకేశ్ విరామం ఇచ్చారు.